తాడిపత్రి పట్టణంలో గాజుల కిష్టప్ప వీధిలో 80% వికలాంగు రాలైనటువంటి సాయిలక్ష్మి కి గత ప్రభుత్వం మూడు చక్రాలు స్కూటీని పంపిణి చేయడం జరిగింది .

అప్పటి నుండి స్కూటర్‌ కు సంబంధించిన  పత్రాలను అనంతపురం ఆర్బి పెటిక్‌ అధికారి గత రెండు సంవత్సరాల నుంచి (ద్రువీకరణ పత్రాలు) ఇవ్వకుండాసాయి లక్ష్మి మరియు భర్త శ్రీనివాసులు చాలా సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా తమ వద్ద  ఎటువంటి ఎటువంటి (ధ్రువీకరణ పత్రాలు లేవు అని చెప్పేవారు. పైగా వికలాంగురాలని కూడా చూడకుండా నానా మాటలతో దుర్భాషలాడుతూ దూషించడం జరిగిందని హెచ్‌.ఆర్‌.ఏ.జే (హ్యూమన్‌ రైట్స్‌ ఫర్‌ జస్టిస్‌) తో మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా స్కూటర్‌ కు సంబంధించి ఎటువంటి కరపత్రాలు తమ వద్ద లేనందున తిరిగి స్కూటీ వెనక్కి ఇవ్వవలసిందిగా అధికారి అన్నట్టు తెలిపారు. దీంతో సాయి లక్ష్మి హెచ్‌.ఆర్‌.ఏ.జె ఆంధ్రప్రదేశ్‌ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి కి ఫోన్‌ లోనే జరిగిన విషయం అంతా చెప్పగా, ఆమె వెంటనే స్పందించి ఆర్జోపెటిక్‌ అధికారితో ఫోన్‌ చేసి వివరణ కోరగా తప్పు కార్యాలయంలోనే జరిగింది, స్కూటీ (ధ్రువీకరణ పత్రాలు కార్యాలయంలోనే ఉన్నాయని చెప్పారు. హెచ్‌.ఆర్‌.ఏ.జే చొరవతో 24 గంటలలోనే స్కూటీ (ధ్రువీకరణ పత్రాలు బాధితులకు ఇవ్వడం జరిగింది. రెండు సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ సమస్యను కేవలం £4 గంటల్లోనే పరిష్కారం చూపించిన హెచ్‌.ఆర్‌.ఏ.జే ఆంధ్రప్రదేశ్‌ మహిళా అధ్యక్షురాలు కాకర్ల సరస్వతి, జిల్లా అధ్యక్షులు గుత్తా భాస్కర్‌ నాయుడు,తాడిపత్రి వైస్‌ (ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌,మహబూబ్‌ బాషా, శంషాద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా బాధితురాలు మాట్లాడుతూ తాను ఎప్పటికీ హెచ్‌.ఆర్‌.ఏ.జే కి రుణపడిపోయి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా హెచ్‌. ఆర్‌. ఏ.జె మీ సమస్య మా పరిష్కారం నినాదంతో ముందుకు సాగుతున్న సంస్థ అని తెలియజేశారు.